హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) సోమవారం తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు.. ఎపి, మహారాష్ట్రలో 30శాతం విస్తరించాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో పూర్తిగా వ్యాపించాయి.
తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 03:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)