శ్రీలంక : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ A జట్టుకు ఆఫ్ఘనిస్థాన్ A పై విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జరిగిన టాస్లో ఆఫ్ఘనిస్థాన్ A కెప్టెన్ విజయం సాధించి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ A జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం భారత్ A మూడు మ్యాచ్ల్లో ఒక విజయం, రెండు పరాజయాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ A రెండు మ్యాచ్ల్లో ఒక విజయం, ఒక ఓటమితో మూడో స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
భారత్ A జట్టు : ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (కెప్టెన్), కుమార్ కుషాంగ్రా (వికెట్ కీపర్), నిషాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్జే, విప్రాజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్.
ఆఫ్ఘనిస్థాన్ A జట్టు : ఇమ్రాన్ మిర్ (కెప్టెన్), హస్సన్ ఇసాఖిల్, ఖలిద్ తనివాల్, బహిర్ షా, ఫర్మానుల్లా సాఫి, షామ్స్ ఉర్ రహ్మాన్, మహ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), జహిర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫైసల్ ఖాన్, ఫరీదూన్ దావూద్జాయ్.









కామెంట్లు (0)