ప్రజాశక్తి-తడ(తిరుపతి): జిల్లాలోని తడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. శ్రీసిటీలో విధులు ముగించుకుని కార్మికులతో సూళ్లూరుపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలను గమనించిన కార్మికులు వెంటనే కిందకు దిగిపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే లోపే వాహనం పూర్తిగా బూడిదైంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తడ వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు దహనం
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 13, 2026, 12:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)