ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కల్కి-2’ చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరుగుతున్నాయి. ‘కల్కి’ తొలి భాగంలో కీలకంగా నిలిచిన సుమతి పాత్రను రెండో భాగం నుంచి తొలగిస్తున్నారని, ఆ పాత్రలో దీపికా పదుకొణె స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నాగ్ అశ్విన్, ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. ‘కల్కి’ కథలో సుమతి పాత్ర అత్యంత కీలకమని, అలాంటి పాత్రను తొలగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. సాయి పల్లవిని సంప్రదించారనే ప్రచారంలో కూడా ఎలాంటి నిజం లేదని చెప్పారు. సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు, ఇతర అప్డేట్స్ను సరైన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పటికే ‘కల్కి-2’కు సంబంధించిన రెండు కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయని, సెప్టెంబర్ నుంచి నాన్స్టాప్ షూటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు.
Print Editionకల్కి 2.. ఆ వార్తలన్నీ అబద్ధం : నాగ్ అశ్విన్
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 09:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)