అమరావతి : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎపి ఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ శనివారం విడుదల చేశారు. మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 23,198 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166.094 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx ద్వారా పొందవచ్చు.
ఎపిఐసెట్ ఫలితాలు విడుదల
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 03:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)