ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్కు ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం గుజరాత్ ఆటగాళ్లు హోటల్కు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. మొదట పొగలు రావడాన్ని గమనించి అలెర్ట్ అయిన క్రికెటర్లు, సహాయక సిబ్బంది తక్షణమే బస్సు దిగిపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న ప్లేయర్లు మరో బస్సులో తాము హోటల్కు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం.. ఆటగాళ్లంతా సురక్షితం
01 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 01, 2026, 09:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)