అమరావతి : రాష్ట్రంలో ఈసెట్ (TG ECET) పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. పాలిటెక్నిక్ (డిప్లొమా), బీఎస్సీ (గణితం) పూర్తి చేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలను టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్ https://ecet.tgche.ac.in/ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అనంతరం ర్యాంకులు సాధించిన అభ్యర్థుల కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా విద్యామండలి త్వరలోనే ప్రకటించనుంది.
TG ECET ఫలితాలు విడుదల
29 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 29, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)