తెలంగాణ : తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 79.92 శాతం, బాలికలు 86.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. నామాల లోకేష్ (వరంగల్) ఫస్ట్ ర్యాంక్ సాధించగా, బోనోతు హేమనాథ్ (సూర్యాపేట) రెండో ర్యాంక్ సాధించాడు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను, ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. http://polycet.sbtet.telengana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Telangana – తెలంగాణ పాలిసెట్ ఫలితాలు రిలీజ్
23 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 23, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)