ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రజా సేవలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, గత ఐదేళ్లుగా జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీటీసీ సభ్యులందరికీ ప్రత్యేక గుర్తింపుగా ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తన సొంత ఖర్చులతో ఐదు రోజుల కేరళ పర్యటనకు శనివారం పయనమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయం నుండి ప్రయాణం ప్రారంభించిన జడ్పీటీసీ సభ్యులు, అనంతరం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జడ్పీటీసీ సభ్యులు వర్రి నరసింహమూర్తి , జడ్పీటీసీ ప్రతినిధి వల్లి రెడ్డి శ్రీను జన్మదిన వేడుకలను అందరూ కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీటీసీ సభ్యులకు ఐదు రోజుల కేరళ పర్యటన
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 13, 2026, 03:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)