హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన శుక్రవారం స్కూళ్లు తెరవాల్సి ఉండగా, ఆ తేదీని 15కి మారుస్తూ సెలవులను మరో మూడు రోజులు పొడిగించింది. ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం రావడంతో.. విద్యార్థుల సౌకర్యార్థం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ సెలవు కారణంగా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు జులై 11వ తేదీ (రెండో శనివారం) నాటి సెలవును రద్దు చేసి, ఆ రోజున యథావిధిగా పాఠశాలలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.
తెలంగాణలో జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 07, 2026, 03:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)