హైదరాబాద్: సాంకేతిక సమస్య కారణంగా ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండయినట్లు అధికారులు శనివారం తెలిపారు. బెంగళూరు-నాగ్పూర్ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, సమస్యను గుర్తించిన పైలెట్ శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు సమాచారమిచ్చారని అన్నారు. అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారని అన్నారు.
సాంకేతిక సమస్యతో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
30 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 30, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)