test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆశాజనకంగా తొలకరి నువ్వు పంట

3 రోజుల క్రితం

hopefully-seasam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- వేపాడ :  ఈ ఏడాది తొలకరి నువ్వు పంట ఆశాజనకంగా ఉందని రైతులు  ఆనందం వ్యక్తం చేశారు. తొలకరి నువ్వు విత్తనాలు వేసిన పొలాల్లో  ప్రస్తుతం పంట పువ్వు  దశలోను, పిందె దశలోనూ ఉందని  తెలిపారు.  సుమారు 100 హెక్టార్లలో పంట ఏపుగా పెరిగి కనిపిస్తుంది.  వాతావరణం ఇదేవిధంగా అనుకూలిస్తే .. రైతన్నకు తొలకరిపంటతో  కొంత వరకు ఫలితం దక్కుతుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం నువ్వు పంటను పరిశీలించిన అనంతరం ఏవో ఎంఎస్ఎస్ స్వాతి మీడియాతో మాట్లాడారు. ఈ  ఏడాది రైతులు ముందుగా  తొలకరి పంట కోసం నువ్వు విత్తనాలు వేశారని  వివరించారు. వాతావరణం అనుకూలించడంతో   ప్రస్తుతం 100 హెక్టార్ల వరకు నువ్వు పంట ఆశాజనకంగా కనిపిస్తుందని అన్నారు. అయితే కొంతమంది రైతుల  పొలాల్లో వేసిన నువ్వు విత్తనాలు మొలక  దశలో ఉన్నాయని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్