న్యూఢిల్లీ : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తో సమావేశమయ్యారు. వెనిజులాతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ రోజు న్యూఢిల్లీలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తో సమావేశం కావడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత్-వెనిజులా సంబంధాల పట్ల ఆమెకున్న దీర్ఘకాల నిబద్ధతను తాము గౌరవిస్తామని అన్నారు. ప్రధాని మోడీతో ఆమె సమావేశం ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం డెల్సీ రోడ్రిగ్జ్ బుధవారం భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలితో సమావేశమైన విదేశాంగమంత్రి
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)