చ్చెర్ల (శ్రీకాకుళం) : బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ …. శుక్రవారం స్థానిక ఎచ్చెర్ల మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. మండల కేంద్రంలో బిజెపి కూటమి సర్కార్ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ …. లారీకి తాళ్ళు కట్టి లాగి నిరసన తెలియజేశారు. ఈ ఆందోళనలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు, మండల కన్వీనర్ ఎన్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ …
15 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 15, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)