ప్రజాశక్తి–పలమనేరు:చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కింద పడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పలమనేరు నుండి పెనుగొలకలకు వెళ్లే ఆర్టీసీ బస్సును బస్టాండ్లో పార్కింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో పలమనేరు జవిలి వీధికి చెందిన నరసింహులు శెట్టి అనే వ్యక్తిపైకి ఆర్టీసీ బస్సు ముందు చక్రం వెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
పలమనేరు ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 10:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)