న్యూఢిల్లీ : షూటింగ్ దిగ్గజం మనుభాకర్ కోచ్ అయిన జస్పాల్ రాణా గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. ఆయన భారత పిస్టల్ షూటర్లకు హై-పెర్ఫార్మెన్స్ కోచ్గా పనిచేస్తున్నారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధ్యక్షుడు కలికేష్ నారాయణ్ సింగ్ డియో తెలిపిన వివరాల ప్రకారం … రాణా ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ISSF ప్రపంచ కప్ నుండి భారత బృందంతో కలిసి తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురైన రాణా ఇటీవల వైద్య సహాయం పొందారు. న్యూఢిల్లీలో దిగిన వెంటనే, అతడిని ఆసుపత్రిలో చేర్చి, గుండెలోని అడ్డంకిని తొలగించడానికి స్టెంట్ అమర్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం …. మొదట్లో అతని పరిస్థితి నిలకడగా ఉందని వార్తలు వచ్చినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితి క్షీణించింది. రానాకు భార్య రీనా రానా, కుమార్తె దేవాంశి, కుమారుడు యువరాజ్, తండ్రి నారాయణ్ సింగ్ రానా, ఇద్దరు తోబుట్టువులు సుష్మా సింగ్, సుభాష్ రానా ఉన్నారు. తర్వాతి తరం షూటర్ల అభివృద్ధికి, వారి అభివృద్ధికి చేసిన కృషికి గాను రానాకు 2020లో ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు లభించింది.

పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్యాలు గెలిచిన మను బాకర్కు రాణా వ్యక్తిగత కోచ్గా వ్యవహరించారు. 2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన జస్పాల్.. గతంలో జాతీయ జూనియర్ కోచ్గా వ్యవహరించారు. అప్పుడే మను బాకర్, సౌరభ్ చౌదరి లాంటి ప్రతిభావంతులైన షూటర్లు వెలుగులోకి వచ్చారు. ఒలింపిక్స్ విజయాల అనంతరం ఆయన గత ఏడాది ఫిబ్రవరిలో జాతీయ కోచ్గా నియమితులయ్యారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హై పర్ఫార్మెన్స్ కోచ్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ప్రధాని మోడి సంతాపం ….
జస్పాల్ రాణా మృతిపై ప్రధాని మోడి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ఆయన మరణం భారత క్రీడా ప్రపంచానికి తీరనిలోటు. షూటింగ్లో ఆయన సాధించిన విజయాలతో దేశానికి ఎంతో పేరు తీసుకువచ్చారు. యువ అథ్లెట్లను తీర్చిదిద్దడంలో ఆయన చూపిన నిబద్ధత ఎనలేనిది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మోడి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.









కామెంట్లు (0)