అమలాపురం (కోనసీమ) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహాసభలు రెండవ రోజు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలుత జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభల సందర్భంగా సీనియర్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కామ్రేడ్ కేతా సూర్యారావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ జెండా ఆవిష్కరణలో అఖిలభారత, రాష్ట్ర నాయకులు, మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం సభ ప్రారంభమైంది. ఆహ్వాన సంఘం అధ్యక్షలు మాజీ ఎమ్మెల్సీ ఐవీ ఉపన్యాసం చేస్తున్నారు.
Day 2 – ఎపి వ్య.కా.స రాష్ట్ర మహాసభలు – ఘనంగా జెండా ఆవిష్కరణ
12 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 12, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)