test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడి

10 మే, 2026

prime-minister-modi-reached-hyderabad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 03:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ పర్యటనలో భాగంగా …. భారత ప్రధాని నరేంద్ర మోడి ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర నాయకులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీకి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని భారీ వరాలు ప్రకటించనున్నారు. సుమారు రూ. 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పలు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం, సాయంత్రం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మోడి ప్రసంగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగానూ ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బేగంపేట, హెచ్‌ఐసీసీ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్పీజీ దళాలతోపాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రధాని వెళ్లే మార్గాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్