అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా యుద్దానికి దారితీశాయి. తమ సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఒమన్ తీరం వెంబడి, హార్ముజ్ జలసంధి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గస్తీ నిర్వహిస్తుండగా.. అమెరికా మిలిటరీ హెలికాప్టర్ ‘ఏహెచ్-64 అపాచీ’ (AH-64 Apache) కూలిపోయింది. ప్రమాదం నుంచి అందులోని ఇద్దరు పైలట్లు డ్రోన్ బోట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ అన్యాయమైన దురాక్రమణకు ఖచ్చితంగా సమాధానం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా హెచ్చరించారు. ఆ హెచ్చరికల సన్నద్ధతతోనే.. హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్పై శక్తిమంతమైన వైమానిక దాడులను ప్రారంభించాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్లు ‘యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్’ అధికారికంగా ధృవీకరించింది. అమెరికా ఫైటర్ జెట్లు జరిపిన ఈ దాడుల కారణంగా దక్షిణ ఇరాన్లోని బందర్ అబ్బాస్, క్వెష్మ్ ద్వీపం, సిరిక్, జాస్క్ కౌంటీలలో భారీ పేలుళ్లు సంభవించాయని, దీంతో ఇరాన్ తన వాయు రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది.
ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులు
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 08:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)