ప్రజాశక్తి-విజయనగరం కోట : తెలుగుదేశం ప్రభుత్వ నిర్వహించిన డీఎస్సీ అవకతవకలపై సిబిఐ నియమించాలని జిల్లా వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో డీఎస్సీ అవకతవకలపై కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన జిల్లా వైసీపీ నాయకులు అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …. డీఎస్సీ అవకతవకలపై సిబిఐ ను నియమించాలని, అదేవిధంగా నెట్ లో ఉన్న రిసల్ట్ డెస్క్ టాప్ ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. లోకేష్ ఫేషియల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి స్టేట్ ఫస్ట్ రావడమేమిటని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు అల్లు అవినాష్, బొత్స అనూష, కోలగట్ల శ్రావణి, మాజీ జిల్లా చైర్మన్ శోభ స్వాతిరాణి జిల్లా నాయకులు పాల్గొన్నారు.
డీఎస్సీ పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలి : వైసీపీ నేతల ధర్నా
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 01, 2026, 01:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)