test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. కావేరి ట్రావెల్ బస్సు దగ్ధం

15 మే, 2026

bus fire acidnet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 15, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఉలవపాడు (ప్రకాశం) : ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కావేరి ట్రావెల్ బస్సు దగ్ధమైంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాదు నుండి తిరుపతికి బయలుదేరిన కావేరి బస్సులో భీమవరం అడ్డరోడ్డు వద్ద ఇంజన్ నుంచి పొగలు రావటం గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను కిందికి దించి వేశాడు. ప్రయాణికులు హుటాహుటిన బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. 36 మంది ప్రయాణికులకు తృటిలో ఘోర అగ్ని ప్రమాదం నుండి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్