శింగరాయకొండ (ప్రకాశం) : సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి వృద్ధ జాలరి మృతి చెందిన ఘటన శుక్రవారం పాకల గ్రామంలో జరిగింది. శింగరాయకొండ మండలం పాకల గ్రామంలో మత్స్యకారుడు కూర కోసం సముద్రంలో కలిసే పాలేరు పరనీటి దగ్గర చేపల కోసం వెళ్లగా, అక్కడ వేట చేస్తున్న సమయంలో జాలరాములు (60) ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించాడు. లోపల ఉన్న మత్స్యకారులను తోటి మత్స్యకారులు బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సముద్రంలో వేటకు వెళ్లి నీటమునిగి వృద్ధ జాలరి మృతి
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 01:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)