ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం నారాయణి సిల్క్ షోరూమ్ సినీ నటి అనసూయ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మెయిన్ రోడ్ లో అనసూయ రాక సందర్భంగా సందడి నెలకొంది. షోరూమ్ ప్రారంభించిన అనసూయ అక్కడి చీరలను పరిశీలించారు. పండుగలకు, పెళ్లి, ఇతర శుభకార్యాలకు సరసమైన ధరలలో నారాయణి వస్ర్తాలను అందిస్తున్నారని తెలిపారు. పట్టు, సిల్క్ చీరలు నారాయణిలో వివిధ రకాలలో ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణి సిల్క్స్ షోరూం యాజమానులు కేశవ గుప్తా, సురేష్, ఉదయ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
కాంచీపురం నారాయణి సిల్క్స్ షోరూంను ప్రారంభించిన సినీనటి అనసూయ
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)