test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నల్లమడులో తల్లీ కూతుళ్ల మృతదేహాలు

01 జూన్, 2026

Bodies of Mother and Daughter Found in Nallamada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉంగుటూరు (ఏలూరు) : ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమడు గ్రామ శివారులో తల్లీకూతుళ్ల మృతదేహాలు కలకలం రేపాయి. సోమవారం ఉదయం దూబచర్ల- చేబ్రోలు మార్గంలోని జీడిమామిడి తోటలో రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన మడ్డ వెంకటలక్ష్మి (46), గంటా ఆంతూ భాయ్ (60) తల్లీకూతుళ్లుగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరి తలకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. ఇది హత్యేనా ? ఇంకేమైనా కారణాలున్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్