హాయ్ ఫ్రెండ్స్.. వేసవి సెలవుల్లో నేను, మా అన్నయ్య గగన్ నాగ్తో కలిసి కాకినాడ జిల్లాలోని కోరింగ అభయారణ్యానికి వెళ్లాం. ఆ ప్రాంతం చాలా బాగుంది. ఇక్కడ మడ అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో చాలా రకాల పక్షులు కూడా ఉన్నాయి. ఇక్కడ మరో ముఖ్య విశేషం ఏమిటంటే, గోదావరి నది పాయ ఒకటి బంగాళాఖాతంలో కలిసే దృశ్యం చాలా బాగుంటుంది. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్రాంతాన్ని చూడటం ద్వారా నేను మడ అడవుల వల్ల కలిగే ఉపయోగాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఈ చెట్లు సముద్ర అలల వల్ల నేల కోతకు గురి కాకుండా కాపాడతాయని తెలుసుకున్నాను.
– యం. హేమంత్, 6వ తరగతి, తిరువూరు.








కామెంట్లు (0)