తిరువనంతపురం: గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో భారతీయ నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడి, అందులో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై కేరళ ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ సమస్యపై కేంద్రం దృఢమైన వైఖరిని అవలంబించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. శనివారం ఆయన తన అధికారిక ఫేస్బుక్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ సుదీర్ఘ పోస్ట్ చేశారు.
“గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించడం అత్యంత బాధాకరం,” అని విజయన్ పేర్కొన్నారు.” ఈ సమస్యపై స్పందన కేవలం నిరసన తెలపడానికే పరిమితం కాకూడదు,” అని ఆయన అన్నారు. అమెరికాను బాధ్యులను చేయాలని, ఆ ప్రాంతంలో సైనిక చర్యలకు ముగింపు పలికేలా ఒత్తిడి తీసుకురావాలని కూడా విజయన్ కేంద్రాన్ని కోరారు. “భారతీయ నావికుల మరణాలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి’ అని ఆయన రాసుకొచ్చారు.









కామెంట్లు (0)