గుంటూరు : గుంటూరులో నలుగురు బిఎల్ఓలను కమిషనర్ మయూర్ అశోక్ సస్పెండ్ చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వి. రాజ్ కుమార్ (243 పిఎస్), కె.నాగరాజు (164 పిఎస్), తూర్పు నియోజకవర్గంలో ధరణి (225 పిఎస్), బి. పవన్ కుమార్ (72) బిఎల్ఓల ను కమిషనర్ కె. మయూర్ అశోక్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన నలుగురు బిఎల్ఓలు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సర్ విధులకు గైర్హాజరు అయ్యారు. కీలకమైన సర్ విధులకు హాజరు కాకుండా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు కూడా తమ ఇళ్లకు వచ్చే బిఎల్ఓలకు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని కమిషనర్ కోరారు.
గుంటూరులో నలుగురు బిఎల్ఓలు సస్పెండ్
17 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)