బుక్కరాయసముద్రం (అనంతపురం) : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఎస్ బిఐ ఎటిఎం మిషన్ ను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎస్ బిఐ ఎటిఎం మిషన్ను ఎత్తుకెళ్లిన దొంగలు ఆ బాక్స్ ను సింగమల మండలం ఆకులోడు వద్ద పడేశారు. పెట్రోల్ పోసి బాక్స్ ను తగలబెట్టారు. క్లూస్ టీంతో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల పనిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎస్ బిఐ ఎటిఎం మిషన్ ను ఎత్తుకెళ్లిన దొంగలు
17 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)