ప్రజాశక్తి-మంగళగిరి : మంగళగిరి ఎయిమ్స్ లో మంగళవారం ఆయుష్ వైద్య విభాగం ఘనంగా ప్రారంభమైంది. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నూతన విభాగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యాధికారిణి డాక్టర్ ఆకుల పుష్పాంజలి, హోమియోపతి వైద్యాధికారిణి డాక్టర్ సాన్యల్ తదితరులు పాల్గొన్నారు. ఇకపై ఎయిమ్స్ రోగులకు ఆధునిక వైద్యంతో పాటు సాంప్రదాయ ఆయుష్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్లో ఆయుష్ వైద్య విభాగం ప్రారంభం
10 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 10:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)